Close

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ రాంసుందర్ రెడ్డి

Publish Date : 24/12/2025

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ రాంసుందర్ రెడ్డి

 

నెల్లిమ‌ర్ల‌, (విజ‌య‌న‌గ‌రం), డిసెంబర్ 23 : స్థానిక‌ ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి మంగళవారం త‌నిఖీ చేశారు. గోదాము ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను తెరిపించి లోపలి గదులను, ఈవీఎం పెట్టెలను ప‌రిశీలించారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుప్ర‌క్క‌ల‌ ప‌రిస్తితుల‌ను ప‌రిశీలించారు. అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

డిఆర్వో ఇ.మురళి, ఆర్‌డిఓ డి.కీర్తి, నెల్లిమ‌ర్ల‌ తాహ‌సీల్దార్ శ్రీ‌కాంత్‌, క‌లెక్ట‌రేట్ ఇంచార్జి ఎన్నిక‌ల‌ సూప‌రింటిండెంట్ ప్రసాదరావు, ఇత‌ర రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.లక్ష్మీవరప్రసాదరావు, సముద్రాల రామారావు, రేగాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం

 

241225-A

241225-A

241225-B

241225-B

241225-C

241225-C