Two Rythu Bazars in the city were inspected by Joint Collector Mayur Ashok on Friday.
Publish Date : 30/05/2022
రైతు బజార్లలో ధరల పరిస్థితిపై జె.సి.ఆరా
విజయనగరం, మే 27 : నగరంలోని రెండు రైతుబజార్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తనిఖీ చేశారు. రింగురోడ్డు, ఆర్ అండ్ బి కూడలి వద్ద వున్న రైతుబజార్లను జె.సి. తనిఖీ చేసి అక్కడ వున్న వసతులపై ఆరా తీశారు. రైతుబజార్ల ఆధునీకరణ పనులపై మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు శ్యాం తో చర్చించారు. రైతుబజార్లలో సమస్యల గురించి తెలుసుకున్నారు. వివిధ రకాల కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలపై ఆరా తీశారు. రైతుబజార్ల ఆధునీకరణ పనుల కోసం ప్రతిపాదనలు త్వరలో అందజేయనున్నట్టు జె.సి. తెలిపారు.
