To make the district pollution free, District Collector Surya Kumari
Publish Date : 06/06/2022


విజయనగరం, జూన్ 02:: జిల్లాలో కాలుష్యం సున్నా శాతానికి తగ్గేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి అద్వర్యం లో ముద్రించిన ఐ.ఈ.సి కరపత్రాలను, పోస్టర్ లను కలెక్టర్ తన ఛాంబర్ లో గురువారం ఆవిష్కరించారు. ఈ ఏడాది ఒకే ధరిత్రి -ప్రకృతి తో సామరస్యంగా జీవించడం అనే నినాదం తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని జీరో కు తగ్గించాలని, ఘన వ్యర్ధాల నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం మన చేతుల్లోనే ఉందని గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంటేన మండలి అధికారులు పాల్గొన్నారు.
