Close

District Collector Surya Kumari, who congratulated the officers, was ranked third in the district in ten examinations

Publish Date : 07/06/2022

 పది పరీక్షల్లో జిల్లాకు మూడో రాంక్

 అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, జూన్ 06::  పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లా మెరుగైన రాంకు ను సాధించింది. రాష్ట్రం లో 13 ఉమ్మడి జిల్లాలకు గాను 77.50 శాతం ఉత్తీర్ణత తో  విజయనగరం జిల్లాకు 3వ రాంక్ వచ్చింది.  మొదటి రాంక్ ప్రకాశం జిల్లా 78.30 సాధించగా 78.22 శాతం తో శ్రీకాకుళం జిల్లా రెండవ స్థానం సాధించింది.

    విజయనగరం జిల్లా నుండి 29,365 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 14,900 మంది  బాలురు , 14,465 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికలు బాలుర కన్నా తక్కువ సంఖ్య లో హాజరైనప్పటికి ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. బాలికల శాతం 79.94 కాగా బాలుర శాతం 75.13  గా నమోదైంది.

      జిల్లా కలెక్టర్  సూర్య కుమారి స్పందన లో అధికారులను ప్రత్యేకంగా విద్యా శాఖాధికారులను అభినందించారు. గతం కంటే మంచి ఫలితాలు రావడం శుభ పరిణామం అన్నారు. ఇంటర్ ఫలితాలు కూడా ఇలాగే రావాలని ఆకాంక్షించారు

District Collector Surya Kumari, who congratulated the officers, was ranked third in the district in ten examinations