9.36 crore deposited in 9361 farmer accounts in the district
Publish Date : 18/06/2022
అన్నదాతలకు అండగా నిలుస్తున్న పంటల బీమా
జిల్లాలో 9361 మంది రైతు ఖాతాల్లోనికి 9.36 కోట్ల జమ
ప్రకృతి కరుణిస్తే ముఖ్యమంత్రి వరమిచ్చారు
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు
విజయనగరం, జూన్ 14: అన్న దాతలకు అండగా నిలుస్తు డా.వై.ఎస్.ఆర్ .ఉచిత పంటల బీమా పధకం క్రింద 2021 ఖరీఫ్ పంట లో నష్టపోయిన రైతన్నలకు ఈ ఖరీఫ్ ప్రారంభం లోనే పంటల నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. మంగళ వారం శ్రీ సత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి లో జరిగిన సమావేశం నుండి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసారు.
జిల్లాలో ఉచిత పంటల బీమా పధకం క్రింద పంట కోత ప్రయోగములలో తక్కువ దిగుబడి వచ్చ్జ్హిన గ్రామాలలో గల 9361 మంది రైతుల కు బీమా పరిహారంగా 9.36 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో అమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి , జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు , పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన మండలి సభ్యులు డా.సురేష్ బాబు, శాసన సభ్యులు కంబాల జోగులు, డిసిసిబి చైర్మన్, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ లు, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు రైతులకు మెగా చెక్కును అందజేసారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ జిల్లాలో తక్కువ పంట నష్టం జరగడానికి ప్రకృతి ఒక కారణం అయితే జరిగిన నష్టాన్ని ఖరీఫ్ ప్రారంభానికి ముందే పరిహారంగా అందజేసి ముఖ్యమంత్రి రైతులకు వరంగా నిలిచారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ పరిహారం కోసం రైతులు సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారని, గత మూడేళ్ళుగా ఆ పరిస్థితి మారిందని, ఎప్పటి పరిహారం అప్పుడే అందజేస్తూ రైతుల పాలిట తన ప్రేమను చాటు కన్నారని అన్నారు. అంతే కాకుండా జిల్లా రైతుల నుండి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సుమారు 715 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మొక్క జొన్న కు కూడా మద్దత్తు ధర ప్రకటించి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లా లోని మంత్రి వర్యుల, ఇతర ప్రజాప్రతినిధుల, అధికారుల సమన్వయం తో రైతుల కు మేలు చేసే కార్యక్రమాలు జరగుతున్నాయని తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గత మూడేళ్ళు గా సెలవులో ఉన్నారని, ప్రజలకు దూరంగా ఉండడం వలన ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదని అన్నారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసారని అశోక్ అన్నారని, నాడు –నేడు పాఠశాలలను చూసి మాట్లాడాలని అన్నారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ పని చేస్తున్నామని , గత మూడేళ్ళలో ప్రజలతో సత్సంబంధాలు కోల్పయిన అశోక్ కు మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా చేసారు. –
లబ్దిదారుల అభిప్రాయాలు :
- రైతులంతా రుణ పడి ఉంటాం : చుక్క సన్యాసి నాయుడు, రైతు, జామి మండలం, జామి గ్రామం :
గత 25 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ప్రభుత్వం నుండి ఎప్పుడూ ఎలాంటి సహాయాన్ని పొందలేదు. ఈ క్రాప్ నమోదు చేసుకున్నాను. 72 సెంట్లలో చెరకు పంట నష్టం జరిగింది. 22 వేల రూపాయలు నాకు నష్ట పరిహారం అందింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నగదు అందింది. రైతులంతా ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటాం.
- ఈ సీజన్లో జరిగిన నష్టం ఈ సీజన్లోనే పొందడం ఆనందంగా ఉంది: సప్ప సూర్య రావు, రైతు, కొర్లం గ్రామం, గంట్యాడ మండలం.
నేను 2.5 ఎకరాల్లో అరటి పంట వేసాను. 2021 లో తుఫాన్ కు పంట నష్టం జరిగింది. రైతు భరోసా కేంద్రం ద్వారా నాకు నష్ట పరిహారం మంజూరైనట్లు విని ఆనంద పడ్డం. ఈ ఏడాది పెట్టుబడికి డబ్బులు అందాయని కుటుంభం అంత సంతోషంగా ఉన్నాం.
- రూపాయి కూడా ఖర్చు కాలేదు: కొయ్యి కృష్ణ, చౌడువాడ గ్రామం. పూసపాటి రేగ మండలం :
నేను 1.40 ఎకరాల్లో అరటి తోట వేసాను . గాలులకు పంట నష్టం జరిగింది. నష్ట పరిహారంగా 42 వేల రూపాయలు అందాయి. గతం లో లంచాలు ఇస్తూ రోజులు తరబడి తిరిగేవాళ్ళం. రూపాయి కూడా లంచం ఇవ్వకుండా వెంటనే బీమా అందడం ఆనందంగా ఉంది.
