Collector A. Suryakumari expressed his indignation over the pollution in the vicinity of the Secretariat.
Publish Date : 18/06/2022
అపారిశుధ్యంపై కలెక్టర్ ఆగ్రహం
వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ
విజయనగరం, జూన్ 14 ః
సచివాలయం చుట్టుప్రక్కలే అపారిశుధ్యం తాండవిస్తుండటంపై, కలెక్టర్ ఎ.సూర్యకుమారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలోని సాయినాధ కాలనీ వార్డు సచివాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పారిశుధ్యం అద్వాన్నంగా ఉండటంపై, సచివాలయ సిబ్బందిని, మున్సిపల్ హెల్తాఫీసర్ను ప్రశ్నించారు. పరిస్థితి మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముందుగా సచివాలయ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. అటెండెన్సు రిజిష్టర్లను పరిశీలించి, వలంటీర్ల హాజరు తక్కువగా ఉండటంపై ప్రశ్నించారు. గర్భిణులకు, పిల్లలకు ఇస్తున్న పోషకాహారం, వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలను తనిఖీ చేశారు. ఎఎన్సి రిజిష్ట్రేషన్ సక్రమంగా చేయకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఇటీవల వెళ్లడైన పదోతరగతి ఫలితాల్లో, ఆ డివిజన్కు సంబంధించిన వివరాలపై, వార్డు విద్యాసహాయకులను ప్రశ్నించారు. అతనివద్ద సరైన సమాచారం లేకపోవడంతో, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హౌసింగ్, ఓటిఎస్ తదితర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ ఆరా తీశారు.
