Housing construction should be expedited, J.C. Mayur orders visit to Ramavaram and Narava secretariats
Publish Date : 18/06/2022
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
రామవరం, నరవ సచివాలయాల సందర్శన లో జేసీ మయూర్ ఆదేశాలు
విజయనగరం, జూన్ 15:: గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి త్వరగా పూర్తయ్యే లా చూడాలని జె.సి మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం జేసీ గంట్యాడ మండలం రామవరం, నరవ సచివా లయాలను తనిఖీ చేశారు. రామవరంలో ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ యూనిట్ ద్వారా తయారైన ఎరువును రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అంద జేయాలని సూచించారు. ఆనంతరం సచివాలయాల్లో నిర్వహిస్తున్న రెజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ తనిఖీ లలో తహసీల్దార్ రాఘవ, ఎం.పి.డి.ఓ నిర్మల, వ్యవసాయ , గృహ నిర్మాణ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
