Joint Collector Mayur Ashok ordered to complete the resurvey process soon.
Publish Date : 23/07/2022
రీసర్వే త్వరగా పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
రామభద్రాపురం, (విజయనగరం), జులై 22 ః రీసర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ఆయన రామభద్రాపురం మండలంలో శుక్రవారం పర్యటించారు. ఎస్.చింతవలస గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. సర్వే చేస్తున్నప్పుడు, సంబంధిత భూముల యజమానులు తప్పనిసరిగా దగ్గర ఉండేలా చూడాలని, దానికోసం వారికి ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకొని, సర్వేని పూర్తి చేయాలన్నారు.
నాయుడువలస, రామభద్రాపురం గ్రామాల్లోని సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. హాజరు పట్టీని, రికార్డులను పరిశీలించారు. సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు, వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై ప్రశ్నించారు. ఆర్బికెల్లో విత్తనాలు, ఎరువుల సరఫరాపై ఆరా తీశారు. అన్ని పంటలకూ ఇ-క్రాప్ నమోదు జరగాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో జెసి మయూర్ అశోక్తోపాటు, బొబ్బిలి ఆర్డిఓ శేషశైలజ, కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సూర్యనారాయణ, సర్వే మరియు లాండ్ రికార్డ్స్ ఎడి త్రివిక్రమరావు, మండల తాశీల్దార్ పి.గణపతిరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
