Close

Farmers should cooperate with re survey, District Collector A. Suryakumari

Publish Date : 23/07/2022

రీ సర్వేకు రైతులు సహకరించాలి

                                                జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి

విజయనగరం, జూలై, 22:  జిల్లాలో చేపడుతున్న రీ సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కోరారు.  రైతులు వారి భూములను చూపించి సరిహద్దులను సక్రమంగా కొలిచేలా సర్వేయర్లతో సహకరించేలా అవగాహన కలిగించాలని, తరువాత మాత్రమే  సర్వేకు వెళ్లాలి సూచించారు.  శుక్రవారం బాడంగి మండలంలో రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేసారు.  అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ బాడంగి మండలంలో  13 గ్రామాలలో రీ సర్వే  ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.   రైతులకు సందేహాలు వుంటే వెంటనే వారి సమక్షంలోనే నివృత్తి చేయాలని సూచించారు.   హౌసింగ్, ఓటిఎస్ పధకాలను సమీక్షించారు.  మండలంలో 87 శాతం ఓటిఎస్ పూర్తయిందని,  మిగిలినవి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.  కలెక్టర్ వెంట కె.ఆర్.సి. ఉప కలెక్టర్ సూర్యనారాయణ, సర్వే సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, తహశీల్దార్, ఎంపిడిఓ, మండల స్థాయి అధికారులు,  సర్వేయర్లు పాల్గొన్నారు.

        అనంతరం భీమవరం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేసారు. సచివాయల సిబ్బందితో  గృహనిర్మాణాలు, గర్భిణీల నమోదు, ఫీవర్ సర్వే, పారిశుద్ద్యం, విత్తనాలు, ఎరువులు సరఫరాలపై వివరాలు అడిగితెలుసుకున్నారు. రిజిస్ట్రర్లను తనిఖీ చేసారు.

Farmers should cooperate with re survey, District Collector A. Suryakumari