03.11.2025 సమిష్టి కృషితో సత్ఫలితాలు, జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డికలెక్టర్, జేసీలను సన్మానించిన జిల్లా అధికారులు
Publish Date : 05/11/2025
పత్రికా ప్రకటన-2
సమిష్టి కృషితో సత్ఫలితాలు
జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
కలెక్టర్, జేసీలను సన్మానించిన జిల్లా అధికారులు
విజయనగరం, నవంబర్ 03 : సమన్వయంతో, సమిష్టిగా కృషి చేసినప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. మోంథా తుఫానును ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించి, అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలను చేపట్టి నష్టాన్ని గణనీయంగా నివారించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ను, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధుమాధవన్ ను సోమవారం గ్రీవెన్స్ సెల్ లో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.మురళి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తుఫాను ను ఎదుర్కోవడంలో జిల్లా అధికారులు నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతిఒక్కరూ సహకరించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ సేధుమాధవన్ ను, రాష్ట్రస్థాయి మోంథా అవార్డు గ్రహీతలైన ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, విఆర్వో రాజ్ మోహన్, ఆశా వర్కర్ బంగారమ్మ లను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డియార్వో శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
…………….
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

3-11-A

3-11-B