A virtual conference with the beneficiaries of the central government schemes as part of the Prime Minister’s face-to-face Azad ka Amrit Mahotsav, the Prime Minister will speak from Shimla, Himachal Pradesh on the 31st of this month
Publish Date : 24/05/2022



విజయనగరం, మే 24 : ఆజాది క అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ది దారులతో ముఖా ముఖి మాట్లాడనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 31 న హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా నుండి ప్రధాని జాతీయ స్థాయి వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని, ఈ కాన్ఫరెన్స్ ద్వార కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్దిదారులు, ప్రజా ప్రతినిధులు, పౌర సంస్థల సభ్యులు, స్వాతంత్ర్య సమర యోధులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అందరూ పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ పదకాలైన ప్రధాన మంత్రి అవాజ్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ మరియు అమృత్, ప్రధాన మంత్రి స్వనిధి , వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్ భారత్ పి.ఎం.జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పధకాలకు సంబంధించిన లబ్ది దారులతో మాట్లాడనున్నారు. జిల్లాలో ఈ పధకాల లబ్ది దారులను ఎంపిక చేసి సంబంధిత శాఖల అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖా ముఖి కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జరీ చేసినట్లు తెలిపారు.
