District Collector A. Suryakumari ordered that workers working under NMR and daily wages in government departments should not be paid less than the fixed wages.
Publish Date : 01/08/2022
కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించకూడదు
జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, జూలై 30: ప్రభుత్వ శాఖలలో ఎన్.ఎం.ఆర్., డైలీ వేజెస్ క్రింద పనిచేస్తున్న కార్మికులకు నిర్ణయించిన వేతనం కన్నా తక్కువ వేతనం చెల్లించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కనీస వేతనాల అమలుపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నైపుణ్యంలేని, పాక్షిక నైపుణ్యం గల, నైపుణ్యం గల, ఎక్కువ నైపుణ్యం కలిగిన గ్రామీణ, పట్టణ పరిధిలో పనిచేసే కార్మికులకు వేరు వేరుగా దినసరి వేతనాన్ని నిర్ణయించారు. నైపుణ్యం లేనివారికి గ్రామీణ ప్రాంతాలలో రూ.380/-, పట్టణ ప్రాంతాలలో రూ.400/-లు గా నిర్ణయించారు. పాక్షిక నైపుణ్యం గల వారికి రూ. గ్రామీణ ప్రాంతాలలో రూ.465/-, పట్టణ ప్రాంతాల వారికి రూ.475/- గాను, నైపుణ్యం గల కార్మికులకు గ్రామీణ ప్రాంతాలలో రూ.570/-, పట్టణ ప్రాంతాలలో రూ.580/- గాను నిర్ణయించారు. ఎక్కువ నైపుణ్యం గల వారికి గ్రామీణ ప్రాంతాలలో రూ.700/- పట్టణ ప్రాంతాలలో రూ.725/-లుగా నిర్ణయించారు. ఈ వేతనాలను ప్రభుత్వ నియంత్రణలో, క్వాజీ గవర్నమెంట్, గవర్నమెంట్ అండర్ టేకింగ్, గవర్నమెంట్ ఏజెన్సీలలో పనిచేస్తున్న కార్మికులకు వర్తింపచేయాలన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. గణపతిరావు, సి.పి.ఓ. బాలాజీ, డిఎం అండ్ హెచ్ఓ డా.రమణకుమారి, ఆర్ అండ్ బి ఎస్.ఇ. జయశ్రీ, పరిశ్రమలు, కార్మిక, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
