Close

District Collector A. Suryakumari ordered that workers working under NMR and daily wages in government departments should not be paid less than the fixed wages.

Publish Date : 01/08/2022

కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించకూడదు

                                        జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి

విజయనగరం, జూలై 30:  ప్రభుత్వ శాఖలలో ఎన్.ఎం.ఆర్., డైలీ వేజెస్ క్రింద పనిచేస్తున్న కార్మికులకు నిర్ణయించిన వేతనం కన్నా తక్కువ వేతనం చెల్లించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కనీస వేతనాల అమలుపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా నైపుణ్యంలేని, పాక్షిక నైపుణ్యం గల, నైపుణ్యం గల, ఎక్కువ నైపుణ్యం కలిగిన  గ్రామీణ, పట్టణ పరిధిలో పనిచేసే కార్మికులకు వేరు వేరుగా దినసరి వేతనాన్ని నిర్ణయించారు.  నైపుణ్యం లేనివారికి గ్రామీణ ప్రాంతాలలో రూ.380/-, పట్టణ ప్రాంతాలలో రూ.400/-లు గా నిర్ణయించారు.  పాక్షిక నైపుణ్యం గల వారికి రూ. గ్రామీణ ప్రాంతాలలో రూ.465/-, పట్టణ ప్రాంతాల వారికి రూ.475/- గాను, నైపుణ్యం గల కార్మికులకు  గ్రామీణ ప్రాంతాలలో రూ.570/-, పట్టణ ప్రాంతాలలో రూ.580/- గాను నిర్ణయించారు.   ఎక్కువ నైపుణ్యం గల వారికి  గ్రామీణ ప్రాంతాలలో రూ.700/- పట్టణ ప్రాంతాలలో రూ.725/-లుగా నిర్ణయించారు.  ఈ వేతనాలను ప్రభుత్వ నియంత్రణలో, క్వాజీ గవర్నమెంట్, గవర్నమెంట్ అండర్ టేకింగ్, గవర్నమెంట్ ఏజెన్సీలలో పనిచేస్తున్న కార్మికులకు వర్తింపచేయాలన్నారు.

       ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. గణపతిరావు, సి.పి.ఓ. బాలాజీ, డిఎం అండ్ హెచ్ఓ డా.రమణకుమారి, ఆర్ అండ్ బి ఎస్.ఇ. జయశ్రీ,  పరిశ్రమలు, కార్మిక, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

District Collector A. Suryakumari ordered that workers working under NMR and daily wages in government departments should not be paid less than the fixed wages.