Close

District Collector Smt. A. Suryakumari advised the officials of revenue and tax department to give high priority to give darshan to common devotees who come for darshan of Mother Padithalli Amma on the occasion of the festival.

Publish Date : 14/10/2022

సామాన్య భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ప్రాధాన్య‌త‌

విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 10:
పండుగ సంద‌ర్భంగా పైడిత‌ల్లి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తుల‌కు త్వ‌ర‌గా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారుల‌కు సూచించారు. అమ్మ‌వారి ఆల‌యాన్ని క‌లెక్ట‌ర్ సోమ‌వారం సంద‌ర్శించి భ‌క్తుల ద‌ర్శ‌నానికి చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు ఏర్పాటు చేసిన సౌక‌ర్యాల‌పై ఆర్‌.డి.ఓ. సూర్య‌క‌ళ‌తో మాట్లాడి తెలుసుకున్నారు. భ‌క్తుల‌కు ద‌ర్శనం క‌ల్పించ‌డంలో ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌కుండా చూడాల‌ని సూచించారు. భ‌క్త‌ల ర‌ద్దీకి అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు ద‌ర్శ‌నాల‌ను నియంత్రిస్తూ ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య ఇ.ఓ. జిల్లా క‌లెక్ట‌ర్ కు స్వాగ‌తం ప‌లికారు.

District Collector Smt. A. Suryakumari advised the officials of revenue and tax department to give high priority to give darshan to common devotees who come for darshan of Mother Padithalli Amma on the occasion of the festival.