Focus on Kharif, the names of the cultivators in this crop should be registered and the complaints received should be resolved in a timely manner, District Collector A. Suryakumari
Publish Date : 07/06/2022
ఖరీఫ్పై దృష్టి పెట్టండి
ఈ క్రాప్లో సాగుచేసినవారి పేరు నమోదు చేయాలి
స్పందన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, జూన్ 06 ః వర్షాలు ప్రారంభమైనందువల్ల, ఖరీఫ్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని, అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేసేటప్పుడు, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో, అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలను జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలుకాబోతోందని, రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో సక్రమంగా అందేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ క్రాప్ నమోదుపై దృష్టి కేంద్రీకరించాలని, పంట సాగుదారుల పేర్లే ఈ క్రాప్లో నమోదు అయ్యేలా చూడాలని సూచించారు. మండలాల్లో పర్యటించేటప్పుడు తప్పనిసరిగా ఆర్బికెలను తనిఖీ చేసి, ఈ-క్రాప్ నమోదును పరిశీలించాలని సూచించారు. రద్దయిన డిఆర్సి సమావేశం, రెండుమూడు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని, దానికి సిద్దంగా ఉండాలన్నారు.
స్పందనకు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. చాలా ఫిర్యాదులు పదేపదే వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడేటప్పుడు, ఫొటో తీసి పెట్టాలని చెప్పారు. టిట్కో ఇళ్లను పంపిణీకి సిద్దం చేయాలని ఆదేశించారు. జగనన్న ఇళ్లకు, అదనంగా బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించాలని సూచించారు. ఆధార్ సెంటర్లపై దృష్టి పెట్టి, సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ బి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
