JC Kishore Kumar inspected the Farmer Assurance Center
Publish Date : 06/01/2022
రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జె.సి. కిషోర్ కుమార్
విజయనగరం, జనవరి 05: బొబ్బిలి మండలం పారాధి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియంపై ఆరా తీసారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కోనుగోలు ప్రక్రియపై రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు.
ఈ పర్యటనలో పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, తదితర పాల్గొన్నారు.
