Joint Collector Mayur Ashok inspected Rythu Bharosa Kendras and Secretariats Inquire about supply of seeds and fertilizers & also inspected the services in the secretariats.
Publish Date : 01/08/2022
రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
విత్తనాలు, ఎరువుల సరఫరాపై ఆరా
సచివాలయాల్లో సేవలను పరిశీలించిన జె.సి. మయూర్ అశోక్
విజయనగరం( నెల్లిమర్ల), జూలై 30 :
నెల్లిమర్ల మండలం లో జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సంధర్భంగా రామతీర్థం, సీతా రామునిపేట, గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. సచివాలయం ల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవల కోసం వచ్చిన దరఖాస్తులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయి, ఎంత వ్యవధిలో పరిష్కారం అయ్యాయనే అంశాలపై ఆరా తీశారు.
రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాల సరఫరా, పంట మార్పిడి ఎంత విస్తీర్ణంలో జరిగిందనే సమాచారాన్ని వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకున్నారు. పి.ఎం.కిసాన్, పచ్చి రొట్ట విత్తనాలు సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి రామారావు, తహశీల్దార్ సీతారామ రాజు తదితరలు పాల్గొన్నారు.
