* Joint Collector Mayur Ashok visits Jami Zone * Inspection of Secretariat, Farmer Assurance Centers
Publish Date : 18/06/2022
*జామి మండలంలో జేసీ మయూర్ అశోక్ పర్యటన*
* సచివాలయం, రైతు భరోసా కేంద్రాల తనిఖీ
విజయనగరం, జూన్ 17 ః జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం జామి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా కుమరాం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రగతి నివేదికలను, హాజరు పట్టీలను పరిశీలించారు. అనంతరం డీపీవో సుభాషిణి, సర్వే విభాగం సహాయ సంచాలకులు త్రివిక్రరావుతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి స్వామిత్వ పథకం, ఇతర సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు. పలు అంశాలపై ప్రజలతో మాట్లాడి వారి అభిప్రయాలను తెలుసుకున్నారు. తదుపరి భీమసింగిలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ క్రాప్ నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు సత్వర సేవలందించాలని, బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఆయన వెంట జామి తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు ఉన్నారు.