Manabadi -Nadu-Today District Collector Surya Kumari directed to expedite the second phase works.
Publish Date : 11/05/2022


విజయనగరం, మే 10:: మనబడి -నాడు-నేడు రెండవ దశ పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. జూన్ నెలాఖరుకు స్లాబ్ స్థాయి కి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలన్నారు. నేటి నుండి ఒక్క రోజు కూడా వృధా కాకుండా పనులు జరగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల విద్య శాఖాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నాడు నేడు రెండవ దశ పనుల పై కలెక్టర్ సమీక్షించారు. ఖాతాలలో డబ్బులు పడిన వెంటనే సిమెంట్ కు ఇండెంట్ పెట్టుకోవాలన్నారు. జె.ఈ లు సచివాలయం ఇంజనీరింగ్ సహాయకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ హెడ్ మాస్టర్ల దే బాధ్యత అన్నారు. ఏదయినా సమస్య ఉంటే గ్రూప్ లో వెంటనే పోస్ట్ చేస్తే తగు పరిష్కారం చూపించడం జరుగుతుందన్నారు.
రెండో దశ నాడు నేడు క్రింద జిల్లాలో 150 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో 523 పాఠశాలల్లో 660 అదనపు తరగతులు మంజూరైనాయని తెలిపారు. వీటిలో పేరెంట్స్ కమిటీ లు లేనివి, స్థలం లేనివి, అదనపు గదులు అవసరం లేని కారణంగా 69 పాఠశాలలను రద్దు చేసినట్లు తెలిపారు. 450 పాఠశాలలకు ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు లభించాయని, 67 పాఠశాలల హెడ్ మాస్టర్స్ ఖాతాలలో నగదు జమ అయినట్లు తెలిపారు. అయితే మంజూరైన వాటిలో ఇంకనూ రద్దు చేయవలసిన పాఠశాలలు ఉంటే తక్షణమే సంబంధిత ఎం.ఈ.ఓ లు వాటి వివరాలను తెలియజేయాలని అన్నారు.
త్వరలో ఉపాధ్యాయులకు డైట్ నందు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తరం విద్యార్థుల ఐ.క్యూ కు తగ్గట్టుగా ఈ శిక్షణ ఉంటుందని, మోరల్ వాల్యూస్ పై కూడా చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. అదే విధంగా 10 వ తరగతి, ఇంటర్ పాస్ అయిన వారికోసం కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్,కెరీర్ గైడెన్స్ తదితర మసక పై శిక్షణ నిచ్చే కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లల నామినేషన్స్ పంపించాలని, ఇందుకు నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి వ్యవహరిస్టారని అన్నారు.
ఇంటర్ పరీక్షల్లో ఆడపిల్లల ఆబ్సెంట్ ఎక్కువగా ఉందని, వారందరినీ గుర్తించి కాలేజ్ లకు రప్పించాలని, లేదా ప్రైవేట్ గా నైనా చదివేలా ప్రేరేపించాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఈ.ఓ జయశ్రీ, ఎస్ ఎస్ ఏ పి.ఓ స్వామి నాయుడు పాల్గొన్నారు.
