Raipur Highway land acquisition completed by January 15, District Collector A. Suryakumari
Publish Date : 18/12/2021
జనవరి 15 నాటికి రాయపూర్ హైవే భూసేకరణ పూర్తి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, డిసెంబరు 17 ః జనవరి 15 నాటికి విశాఖపట్నం-రాయపూర్ గ్రీన్ఫీల్డు జాతీయ రహదారి భూసేకరణను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. రాయపూర్ జాతీయ రహదారి (130 సిడి) భూసేకరణపై తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని పాచిపెంట నుంచి కొత్తవలస వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ జాతీయ రహదారికి సుమారు 723 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉందని, దీనిలో రోడ్డు కోసం 509 హెక్టర్లు రోడ్డు కోసం సేకరించాల్సి ఉందని చెప్పారు. దీనిని నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీలవారీగా కలెక్టర్ సమీక్షించారు. మొదటి ప్యాకేజీ దాదాపు పూర్తి అయ్యిందని చెప్పారు. మొత్తం భూసేకరణ అంతా జనవరి 15 నాటికి పూర్తి అయ్యేలా, యుద్దప్రాతిపదికన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, ఆర్డిఓ బిహెచ్ భవానీశంకర్, ఎస్డిసి వెంకటేశ్వర్లు, జాతీయ రహదారుల పిడి, ఇతర అధికారులు పాల్గొన్నారు.