* Steps should be taken to get all workers involved in e-Shram * * District Collector A. Suryakumari directed the officers
Publish Date : 16/05/2022
*ఇ-శ్రమ్ లో కార్మికులందరూ చేరేలా చర్యలు తీసుకోవాలి*
*అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, మే 14 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులందరినీ ఇ-శ్రమ్ పథకంలో చేరేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి శనివారం ఓ ప్రకటన ద్వారా ఆదేశించారు. ఇ – శ్రమ్ ఇన్సూరెన్స్ ద్వారా అందే ప్రయోజనాలను కార్మికులకు వివరించాలని సూచించారు. ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘ సభ్యులు, సచివాలయ వాలంటీర్లు, క్లాప్ మిత్రాలు, నగర దీపికలు, హెల్త్ కేర్ వర్కర్స్, ఆశా కార్యకర్తలు, రైతులు, మత్స్యకారులు, రోజువారీ సాధారణ కూలీలు, ఇతర రంగాలలో పనిచేస్తూ రూ.15వేల కంటే తక్కువ జీతం తీసుకుంటున్న వారందరినీ ఈ పథకంలో చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయానికి లేదా దగ్గర్లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్లి కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు ఈ – శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సంబంధిత లైన్ డిపార్ట్మెంటు అధికారులు వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉన్న ప్రతి వాలంటీర్ ఇ – శ్రమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు తమ క్లస్టర్లలో ఉన్న ప్రజలందరికీ దీని ప్రయోజనాలను వివరించి పథకంలో చేర్పించాలని దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మంట్ అధికారులతో పాటు మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
