The vegetable carving competition organized at Babametta Shilparam on Sunday enthralled the visitors. The patterns made with different types of vegetables are very impressive
Publish Date : 19/07/2022
ఆకట్టుకున్న వెజిటబుల్ కార్వింగ్
ఉత్సాహంగా చిత్రలేఖన పోటీలు
విజయనగరం, జూలై 17:
బాబామెట్ట శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన వెజిటబుల్ కార్వింగ్ పోటీలు సందర్శకులను ఉత్సాహపరిచాయి. వివిధ రకాల కూరగాయలతో చేసిన ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాల మేరకు, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఏ.వి.ఎస్.వి. జమదగ్ని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసారు. సుమారు 40 మంది ఈ పోటీల్లో పాల్గొని, తమలోని నైపుణ్యాన్ని చూపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, డిఈఓ డాక్టర్ జయశ్రీ, సమగ్ర శిక్ష ఏపిసి డాక్టర్ స్వామి నాయుడు వ్యవహరించి, విజేతలను ఎంపిక చేశారు.
జిల్లా టూరిజం అధికారి పి ఎన్ వి లక్ష్మీనారాయణ ఈ పోటీలకు సమన్వయాధికారిగా వ్యవహరించారు. శిల్పారామంలో పిల్లలకోసం కొత్తగా ఏర్పాటు చేసిన బౌన్సీ, బుల్ రైడ్ ఎంతగానో అలరించింది. కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా, స్వాతంత్య్రోద్యమం మరియు పర్యావరణ పరిరక్షణకు పై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటిలను నిర్వహించారు. డ్రాయింగ్ లో సీనియర్ విభాగంలో మొదటి బహుమతి బి.గాయత్రీ శివాని, జీజీహెచ్ స్కూల్ దాసన్న పేట , రెండో బహుమతి బి.జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్, నారాయణ కాలేజ్, థర్డ్ ప్రైజ్ జి.వర్శిని, ఆర్డర్ స్కూల్, కోనాడ, గెలుపొందారు. డ్రాయింగ్లో జూనియర్ విభాగంలో మొదటి బహుమతిని వి. సాహివీ మహాలక్ష్మి , రెండో బహుమతిని పి.రష్మిత, థర్డ్ ప్రైజ్ ఎం.గౌతమ్ గెలుపొందారు. వెజిటబుల్ కార్వింగ్ పోటీల్లో మెదటి బహుమతి ఎస్.జే.ఆర్. కృష్ణ వేణి , రెండో బహుమతి కె. రవి ప్రకాష్, మూడో బహుమతిని యూ.అనుమౌళిక గెలుపొందారు. విజేతలకు అధికారులు బహుమతి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆహ్లాదపరిచాయి.
