Transparency Resurvey, Joint Collector Kishore Kumar
Publish Date : 31/01/2022
పారదర్శకంగా రీసర్వే
జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్
దత్తిరాజేరు (విజయనగరం), జనవరి 29 ః జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం క్రింద జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. దత్తిరాజేరు మండలం లక్ష్మీపురంలో ప్రయోగాత్మకంగా రీసర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై మండల కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కిశోర్ శనివారం సమీక్షించారు. సర్వే పకడ్బంధీగా నిర్వహించడమే కాకుండా, వాటి నివేదికలను కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, దానిని దృష్టిలో ఉంచుకొని అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని జెసి కోరారు. ఈ సమావేశంలో తాశీల్దార్ సులోచనారాణి, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.