212 tractors distributed today as part of Megamela, YSR Machinery Service in Vijayanagar
Publish Date : 07/06/2022
నేడు విజయనగరంలో మెగామేళా
వైఎస్ఆర్ యంత్రసేవ లో భాగంగా 212 ట్రాక్టర్లు పంపిణీ
విజయనగరం, జూన్ 06 ః వైఎస్ఆర్ యంత్రసేవ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో మెగా మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 212 రైతు సంఘాలకు 212 ట్రాక్టర్లను, మరో 29 సంఘాలకు వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను, ఇలా మొత్తం సుమారు రూ.18.27 కోట్ల విలువైన పరికరాలను, రూ.5.96కోట్లు రాయితీతో అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గత ఏడాది 211 సంఘాలకు, రూ.11.59కోట్ల విలువైన యంత్రపరికరాలను, రూ.3.85కోట్ల రాయితీతో అందజేయడం జరిగిందని తెలిపారు. మెగామేళా కార్యక్రమాన్ని లైవ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహనరెడ్డి గుంటూరులో ప్రారంభిస్తారని, అనంతరం జిల్లాలో పంపిణీ ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రైతులంతా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
