A yoga day should be organized in the suburbs on June 21, youth groups should be formed with young people of general interest, solid waste management centers should be brought into use, District Collector Surya Kumari
Publish Date : 14/06/2022
జూన్ 21 న ప్రతి గ్రామంలో యోగా డే నిర్వహించాలి
సాధారణ ఆసక్తి గల యువకులతో యూత్ గ్రూప్స్ ఏర్పాటు
ఘన వ్యర్ధ నిర్వహణా కేంద్రాలను వినియోగం లోనికి తేవాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, జూన్ 10:: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన్ 21న ప్రతి గ్రామంలో యోగా దినోత్సవం నిర్వహించాలని కలెక్టర్ సూర్య కుమారి సూచించారు. ఈ లోపల సఖి బృందాలకు, యూత్ గ్రూప్ లకు యోగ శిక్షణ నివ్వాలి సూచించారు. ప్రతి గ్రామం లో ప్రాధాన్యత గల స్థలాన్ని గుర్తించి అక్కడే యోగ డే నిర్వహించాలన్నారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈఓపిఆర్డీ, మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించి వార్ని సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని, పాస్ అయ్యేలా చూడాలని అన్నారు.
గ్రామాల్లో 9 నుండి 21 సం. ల మధ్య గల బాలికలతో ఇప్పటికే సఖి గ్రూవు లు ఏర్పాటు అయి ఉన్నాయని, వారికి వ్యక్తిగత పారిశుధ్యం, ఎర్లీ మేరేజెస్, ఎర్లీ ప్రేగ్నన్సీ, వాటి వలన కలిగే దుష్పరిణామాల పై అవగాహన కలిగించాలన్నారు. వయసును బట్టి గ్రూప్ లను ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా శిక్షణ నివ్వాలన్నారు. మెప్మా, డి ఆర్ డి ఏ సంస్థల ద్వారా బృందాల ఏర్పాటు, అవగాహనా సదస్సులు కనీసం వారానికి ఒక సారి జరగాలన్నారు.
అదే విధంగా సాధారణ ఆసక్తి సమూహాలు (కామన్ ఇంటరెస్ట్ గ్రూప్స్) గల 18 నుండి 35 సం. ల వయసు గల పురుషులతో బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. జూన్ 21 నాటికి ఈ బృందాలు ఏర్పాటు కావాలని , జూన్ 30 లోపల రిజిస్ట్రేషన్లు పూర్తి కావాలని అన్నారు. ఈ గ్రూప్ లను మీ సేవ లో రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. కుల, మతాల తేడా లేకుండా ఆసక్తి ఉన్న అందరిని చేర్చుకోవలని, ఎలాంటి విద్యార్హత లేదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్ సభ్యులకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ నిచ్చి భవిష్యత్తు లో ఋణాలను అందించడం జరుగుతుందన్నారు.
గ్రామాల్లో నున్న ఘన వ్యర్ధ నిర్వహణా షెడ్లను వినియోగం లోనికి తేవాలని ఈఓపిఆర్డీ లకు ఆదేశించారు. తడి, పొడి చెత్త లను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా ఎక్కడికక్కడ చెత్త నిల్వలు లేకుండా చూడాలన్నారు. దుకాణాలలో డస్ట్ బిన్లు తప్పకుండా వినియోగించేలా చూడాలని, లేని యెడల పెనాలిటీ లు వేయాలని అన్నారు. కమ్యూనిటీ టాయిలెట్ లను వినియోగించేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ డా.అశోక్ కుమార్, డి.ఆర్.డి.ఏ పి.డి కల్యాణ చక్రవర్తి, మెప్మా పి.డి సుధాకర రావు, డి.పి.ఓ సుభాషిణి, ఎన్. వై.కె సమన్వయాధికారి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.
