Collector A. Suryakumari directed the concerned authorities to complete the work Nadu-Nedu – August 15 in the district in view of the coming academic year.
Publish Date : 18/06/2022
*ఆగస్టు 15 నాటికి నాడు – నేడు పనులు పూర్తి*
*అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, జూన్ 14 ః వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 15 నాటికల్లా జిల్లాలో చేపట్టిన నాడు – నేడు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. నూతన విద్యావిధానంలో భాగంగా అదనపు తరగతులు అవసరమని, దానికి తగ్గట్టుగా 256 తరగతి గదులకు సంబంధించిన పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో నాడు – నేడు పనులపై జిల్లా స్థాయి అధికారులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాడు – నేడు రెండో దశలో భాగంగా జిల్లాకు 451 అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు లభించాయని వాటిని కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ నిర్దేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులను ప్రణాళికాయుతంగా, మౌలిక వసతులను సమకూర్చాలని సూచించారు.
సమావేశంలో సమగ్ర శిక్షా పీవో స్వామినాయుడు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ. శివానంద్ కుమార్, ఏపీడబ్ల్యూడీసీ ఈఈ శామ్యూల్, పబ్లిక్ హెల్త్ ఈఈ దిలీప్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
