District Collector Smt. A. Suryakumari handed over the laptop to Divyangudu Jamie Ganesh at the Collectorate Auditorium on Monday.
Publish Date : 07/06/2022
జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ద్వారా, దివ్యాంగుడు జామి గణేష్కు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ల్యాప్టాప్ ను అందజేశారు. జిల్లాకు చెందిన గణేష్, నూజివీడు ఐఐఐటిలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. తన విద్యాభ్యాసన కోసం, ల్యాప్టాప్ కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, సుమారు రూ.40వేలు విలువైన ల్యాప్టాప్, బ్యాగును అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖాధికారి డి.కీర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
