District Collector Surya Kumari suggested that the first priority should be given to the construction of Farmer Assurance Centers, YSR Farmer Assurance Centers and Secretariat buildings in the work being carried out with employment guarantee funds.
Publish Date : 08/06/2022


విజయనగరం, జూన్ 07:: ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనుల్లో రైతు భరోసా కేంద్రాలు , వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రాలను, సచివాలయాల భవనాల నిర్మాణాలకు తొలి ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టరు సూర్య కుమారి సూచించారు. మంగళవారం జామి మండలం జాగారం, చింతాడ సచి వాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అందరి ఫంక్షనల్ అసిస్టెంట్ల తో మాట్లాడి పనుల పై ఆరా తీసారు. అటెండెన్స్, పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు. వ్యవసాయ సహాయకులతో ఖరీఫ్ సన్నదత పై వివరాలు అడిగారు. పంటల మార్పిడి పై రైతులకు ఏ విధమైన అవగాహన కలిగిస్తున్నారని ప్రశ్నించారు. రబీ లో ఎంత పంట వేశారు, మద్దతు ధర ఎంత వచ్చిందని అడిగారు. మోక్కజొన్న, ఆయిల్ పామ్ పంటలను వేసేలా రైతుకు అవగాహన కలిగించాలన్నారు. నాడు నేడు పనుల పై సమీక్షించారు. నిధులు ఎంత వచ్చాయి, సిమెంట్ ఇండెంట్ ఎంత పెట్టారని ప్రశ్నించారు. నిధులు రాగానే సిమెంట్ ఇండెంట్ తీసుకోవాలని సూచించారు. ఓ.టి.ఎస్ చెల్లించిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని కార్యదర్శి కి సూచించారు. ఈ సందర్బంగా రిజిస్ట్రేషన్ల కు ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని తనిఖీ చేశారు.
గ్రామాల్లో సఖి బృందాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణలు ఇవ్వాలని, యోగా తరగతులు నిర్వహించాలని మహిళా పోలీస్ లకు సూచించారు. అంగన్వాడీ, ఏ.ఎన్. ఎం లు శత శాతం గర్భిణీల నమోదు చేయాలని, వారికి పోషకాహారం అందించాలని ఆదేశించారు. సామ్, మామ్ పిల్లల్ని గుర్తించి ఎన్.ఆర్.సి కి రిఫర్ చేయాలని సూచించారు. వయోజనులలో నిరక్షరాస్యలను గుర్తించి చిట్టి గురువుల ద్వారా విద్యాభ్యాసం జరిగేలా చూడాలని అన్నారు. గ్రామాల్లో శత శాతం అక్షరాస్యలు ఉండాలన్నారు. అనంతరం ఈ- సేవలను తనిఖీ చేశారు. గడువు దాటకముందే వినతులు పరిష్కారం జరగాలన్నారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ నీలకంఠ రావు, ఎం.పి.డి.ఓ సతీష్, మండల ఇంజినీర్, వ్యవసాయ అధికారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
