Close

District Collector who inspected the Inter Examination Centers

Publish Date : 16/05/2022

ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌
జిల్లాలో ప్ర‌శాంతంగా ఇంట‌ర్‌ ప‌రీక్ష‌లు :  జిల్లా క‌లెక్ట‌ర్‌

విజ‌య‌న‌గ‌రం, మే 14 :
జిల్లా వ్యాప్తంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. జిల్లాలో 66 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఎక్క‌డా ఎలాంటి మాల్ ప్రాక్టీసుకు తావులేకుండా ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. న‌గ‌రంలోని ఇంట‌ర్ ప‌రీక్ష కేంద్రాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి శ‌నివారం త‌నిఖీ చేశారు. శ్రీ‌చైత‌న్య బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌, తోట‌పాలెంలోని గాయ‌త్రి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌స్తున్న తీరును త‌నిఖీ చేశారు. అక్క‌డ విద్యార్ధుల‌కు క‌ల్పించిన స‌దుపాయాల ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తంచేశారు.ఆయా కేంద్రాల్లో ప‌రీక్ష‌కు ఎంత‌మంది విద్యార్ధులు హాజ‌ర‌య్యిందీ ప‌రీక్ష కేంద్రాల సూప‌రింటెండెంట్‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

District Collector who inspected the Inter Examination Centers