Farmers should immediately add the threshed grain to the RBKs, said Joint Collector Kishore Kumar
Publish Date : 01/02/2022
నూర్పు చేసిన ధాన్యాన్ని రైతులు వెంటనే ఆర్.బి.కె లకు చేర్చాలి
సంయుక్త కలక్టర్ కిషోర్ కుమార్
విజయనగరం, జనవరి 31: జిల్లాలో ఖరీఫ్ పంట కాలంలో మూడు లక్షల 15 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది దీనికిగాను 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జిల్లాలో జరిగిందని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. . ఇప్పటివరకూ రెండు లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, అదే విధముగా చాలా మంది రైతులు ఇంకా ధాన్యాన్ని కుప్పల రూపములో నిల్వ వుంచడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు వెంటనే ధాన్యం నూర్పిడి చేసి రైతులు తమ ధాన్యాన్ని సమీప ఆర్ బి కే లో అమ్ము కోవాలని రైతులకు జె.సి విజ్ఞప్తి చేసారు. అలాగే యూరియా లభ్యం చూసుకున్నట్లయితే జిల్లాలో ప్రస్తుతం 2039 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, కోరమండల్ కంపెనీ ద్వారా జిల్లాకు 1326 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని తెలిపారు. కాబట్టి ఈ విషయంలో రైతు సోదరులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని తెలియజేసారు. యూరియా కు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను కూడా మార్కెట్లో అందుబాటులో పెట్టడం జరిగిందని, ఇది కూడా యూరియా తో సమానంగా పనిచేస్తుందని అన్నారు. ఒక అర లీటరు మాత్రం ఎకరానికి వాడినట్లైతే ఒక యూరియా బస్తా వేసిన ఫలితము పంట కలుగుతుందని, దయచేసి రైతు సోదరులు ఈ నానో యూరియా ను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ రైతు తెలియజేసారు.
