Funds sanctioned for housing scheme for the poor, Rs 30.65 crore credited to personal accounts, District Collector A. Suryakumari
Publish Date : 14/12/2021
పేదలందరికీ ఇళ్ళు పధకానికి నిధులు మంజూరు
రూ.30.65 కోట్ల వ్యక్తిగత ఖాతాలకు జమ
జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున నవరత్నాలు లో భాగంగా పేదలందకీ ఇళ్లు కార్యక్రమం ఎన్.పి.ఐ. (నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు) లో భాగంగా ఇంతవరకు సుమారుగా 22,921 మంది లబ్దిదారులకు 100.71 కోట్లు పేపెమెంట్ జనరేట్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. 95 లక్షలు విలువ చేసే సిమెంట్, స్టీలు లబ్దిదారులకు ఇవ్వడం ఇరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం 5133 లబ్దిదారులకు 30,65,87,322 (రూ. 30.65 కోట్లు) తమ వ్యక్తిగత ఖాతా నందు జమచేయడం జరిగిందని వివరించారు. మిగతారావలసిన 69 కోట్లు కూడా వారం రోజులలో జమచేయడం జరుగుతుందన్నారు. సిమెంట్, స్టీల్ అన్ని గొడాములో నిండుగా ఉన్నవని, పేమెంట్స్ కూడా అకౌంట్స్ లో పడుతున్నాయి కావున లబ్దిదారులు త్వరగా ఇళ్లు నిర్మాణాలు చేపట్టి స్లాబులు పూర్తి చేయాలని ఆ ప్రకటనలో కోరారు.
