Joint Collector Mayur Ashok directed the officials of the Housing Department and the Engineering Assistants of the Secretariat that the house should be built by everyone who took the patta.
Publish Date : 31/05/2022
అందిరిచేతా ఇళ్లు కట్టించాల్సిందే
*ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి ఒప్పించండి
*డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో జేసీ మయూర్ అశోక్
విజయనగరం, మే 30 ః పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరి చేతా ఇల్లు కట్టించాల్సేందేనని గృహ నిర్మాణ శాఖ అధికారులను, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. దశల వారీగా రోజువారీ, వారాంతాపు లక్ష్యాలను నిర్దేశించుకొని పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు. వంద శాతం మనసు పెట్టి పని చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా విజయనగరం డివిజన్ లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో డివిజన్ స్థాయి అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలనే లక్ష్యంతో లేఅవుట్లలో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని, కావున లబ్ధిదారులను ప్రోత్సహించి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. బీబీఎల్ నుంచి బీఎల్ కు, బీఎల్ నుంచి ఆర్ ఎల్ కు నిర్మాణాలు పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక డీఈలు, ఏఈలు లేఅవుట్ వారీ సమీక్షలు నిర్వహించి నిర్మాణాల్లో వేగం పెంచాలని నిర్దేశించారు. స్థానిక అధికారులు, సచివాలయ పరిధిలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లాలని, వారిని ఒప్పించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అప్రోచ్ రోడ్లు అవసరమైన చోట త్వరితగతిన ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. అలాగే ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి బిల్లులు మంజూరు విషయంలో వివరాలు సరిగ్గా నమోదు కాకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, వాటిని పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా బిల్లులు మంజూరు కాని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల వివరాలను అప్ డేట్ చేయాలని ఆదేశించారు.
ప్రోత్సహించిన ప్రజా ప్రతినిధులకు అవార్డులు
స్థానికంగా ఇళ్ల నిర్మాణాలు వేగం కావడానికి సహకరించే గ్రామ సర్పంచ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందించనున్నాయని, కావున అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకొని పోవాలని సూచించారు. స్థానిక పరిస్థితులపై వారికి అవగాహన ఉంటుంది కాబట్టి వారి సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టా వచ్చి కూడా ఇల్లు నిర్మించడానికి ముందుకు రాని లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో విజయనగరం ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, గృహ నిర్మాణ శాఖ పీడీ ఎస్.వి. రమణ మూర్తి, ఈఈ శ్రీనివాసరావు, డివిజన్ పరిధిలోని డీఈలు, ఏఈలు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………………………………………………………………………………
జారీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.
విజయనగరం, మే 30 ః పట్టా తీసుకున్న ప్రతి ఒక్కరి చేతా ఇల్లు కట్టించాల్సేందేనని గృహ నిర్మాణ శాఖ అధికారులను, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. దశల వారీగా రోజువారీ, వారాంతాపు లక్ష్యాలను నిర్దేశించుకొని పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు. వంద శాతం మనసు పెట్టి పని చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా విజయనగరం డివిజన్ లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో డివిజన్ స్థాయి అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలనే లక్ష్యంతో లేఅవుట్లలో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని, కావున లబ్ధిదారులను ప్రోత్సహించి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. బీబీఎల్ నుంచి బీఎల్ కు, బీఎల్ నుంచి ఆర్ ఎల్ కు నిర్మాణాలు పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక డీఈలు, ఏఈలు లేఅవుట్ వారీ సమీక్షలు నిర్వహించి నిర్మాణాల్లో వేగం పెంచాలని నిర్దేశించారు. స్థానిక అధికారులు, సచివాలయ పరిధిలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లాలని, వారిని ఒప్పించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అప్రోచ్ రోడ్లు అవసరమైన చోట త్వరితగతిన ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. అలాగే ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి బిల్లులు మంజూరు విషయంలో వివరాలు సరిగ్గా నమోదు కాకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, వాటిని పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా బిల్లులు మంజూరు కాని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల వివరాలను అప్ డేట్ చేయాలని ఆదేశించారు.
ప్రోత్సహించిన ప్రజా ప్రతినిధులకు అవార్డులు
స్థానికంగా ఇళ్ల నిర్మాణాలు వేగం కావడానికి సహకరించే గ్రామ సర్పంచ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందించనున్నాయని, కావున అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకొని పోవాలని సూచించారు. స్థానిక పరిస్థితులపై వారికి అవగాహన ఉంటుంది కాబట్టి వారి సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టా వచ్చి కూడా ఇల్లు నిర్మించడానికి ముందుకు రాని లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో విజయనగరం ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, గృహ నిర్మాణ శాఖ పీడీ ఎస్.వి. రమణ మూర్తి, ఈఈ శ్రీనివాసరావు, డివిజన్ పరిధిలోని డీఈలు, ఏఈలు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
