Reaching Safe Than Speed * Protecting Victims and Standing as Good Samaritans * District Collector Surya Kumari at Road Safety Committee Meeting
Publish Date : 06/06/2022
* వేగం కన్నా సురక్షితంగా చేరడం మిన్న
* ప్రమాదం బారిన పడిన వారిని రక్షించి గుడ్ సమరటన్ గా నిలవాలి
* రహదారి భద్రతా కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, జూన్ 03:: వాహన చోదకులు వేగం కన్నా సురక్షితంగా గమ్యం చేరడం ముఖ్యమని, ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదని అన్నారు.వాహనాలు నడిపే టప్పుడు ఒక్కసారి కుటుంభ సభ్యుల్ని గుర్తు చేసుకోవాలని, అప్పుడే బాధ్యతలు గుర్తుకు వచ్చి, జాగ్రత్తగా వాహనాన్నిల్ ను గుర్తించి సైన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని, రోడ్లకిరివైపులా పొదలను, చెట్లను తొలగించాలని సూచించారు. అదే విధంగా రోడ్ల పై ఆక్రమణలను తొలగించి, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలను వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని డి.ఎం.హెచ్. ఓ డా.రమణ కుమారి కి ఆదేశించారు. ప్రమాదం జరిగి మరణించిన కేసు ల పై 24 గంటలలోపు జాయింట్ ఇన్స్పెక్షన్ జరిపి మరణం కు గల కారణాల పై నివేదిక ఇవ్వాలని అన్నారు. స్వచ్చంద సంస్థల సేవలను రవాణా శాఖ వినియోగించు కోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా ఎస్.పి దీపిక మాట్లాడుతూ వాహనాల నుండి శబ్ధ కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని నివారణకు ప్రత్యేక డ్రైవ్ జరిపి యువత కు అవగాహన కలిగించాలన్నారు.
రవాణా ఉప కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతూ కొత్త నిబంధనల మేరకు ఇక పై ప్రతి 15 రోజులకు ఒక సారి రహదారి భద్రతా సమావేశం జరపాలని, మొదటి శుక్రవారం వర్చువల్ గాను, 3 వ శుక్రవారం ఫీజికల్ గాను జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జరపడం జరుగు తుందన్నారు.
* ప్రాణాలు నిలిపే అవకాశాన్ని వదులుకోవద్దు:: కలెక్టర్
రహదారి ప్రమాదానికి గురైన వారిని రక్షించే తొలి వ్యక్తి గా నిలవడం అదృష్టాంగా భావించాలని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు గుడ్ సమారిటన్ గా మారాలని పిలుపునిచ్చారు. రోడ్ ప్రమాదం లో గాయ పడిన వారిని వారితో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఎలాంటి ప్రతిఫలం ఆశించ కుండా సహాయం చేసే వ్యక్తి ని గుడ్ సమారిటన్ గా గుర్తించి ప్రోత్సాహకాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని పేర్కొన్నారు. గాయపడిన వారిని ఒక గంట లోపు ఆసుపత్రికి చేర్చిన వారికి గుడ్ సమారిటన్ అవార్డ్ ను సర్టిఫికెట్ ను, లక్ష రూపాయల నగదు ను అందించడం జరుగుతుందన్నారు. ఈ చట్టం లోని అంశాల పై ఇప్పటికే సచివా లయాల సిబ్బందికి అవగాహన శిక్షణ నివ్వడం జరిగిందన్నారు.
ఈ సందర్బంగా ఇటీవల లెండి కాలేజ్ వద్ద ప్రమాదం లో గాయ పడి, కొన ఊపిరి తో నున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి గోపి అనే వ్యక్తిని కలెక్టర్, ఎస్. పి ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ , పోలీస్, ఆర్.టి.సి, నేషనల్ హై వేస్ తదితర శాఖల కు చెందిన అధికారులు పాల్గొన్నారు.
