Sakhi program in coordination with all departments, day-to-day work should be expedited, District Collector Surya Kumari
Publish Date : 23/05/2022
అన్ని శాఖల సమన్వయం తో సఖి కార్యక్రమం
నాడు- నేడు పనులను వేగంగా జరపాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగాం, మే 21 : కిషోర బాలికల అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య ను అందించాలనే ఉద్దేశ్యం తో జిల్లాలో అమలు జరుపుతున్న సఖి కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయం తో విజయవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పిలుపు నిచ్చారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులు కావాలని కోరారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో సి.డి.పి.ఓ లు, ఎం.ఈ.ఓ లు, హెడ్ మాస్టర్లతో సఖి, నాడు- నేడు కార్యక్రమాల పై కలెక్టర్ సమీక్షించారు.
కిషోర బాలికల భవిష్యత్తు కోసం వారిని విద్యావంతులుగాను, ఆరోగ్యవంతులు గాను , తీర్చిదిద్దడానికి , స్వశక్తి తో ఎదగడానికి , స్వావలంబన సాధించడానికి అవసరమైన అవకాశాలను అందించడమే సఖి గ్రూప్ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఇందులో భాగంగా 9 నుండి 19 ఏళ్ళ మధ్య నున్న బాలికలను గుర్తించి, ప్రతి గ్రామం లో కనీసం ఒక గ్రూప్ ను ఏర్పాటు చేయాలని, ఈ గ్రూప్ ను ముందుండి నడిపించడానికి మహిళా పోలీస్, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్త , ఎన్.వై.కే ప్రతినిధులు ముఖ్యంగా ఉపాధ్యాయురాలు నిర్వాహకులుగా వ్యవహరిస్తారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నెల వారీగా లేదా అవసరం పడినపుడు ఈ గ్రూప్ సమావేశాలు నిర్వహించాలసి ఉంటుందని, సమావేశాల్లో ఆరోగ్యం, పోషకాహారం, మహిళా రక్షణ , ఎర్లీ మరేజేస్ , ఎర్లీ ప్రేగ్నన్స్ వలన కలిగే నష్టాలూ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతల పై అవగాహన కలిగించాలని తెలిపారు. కిషోర బాలికలకు శిక్షణ నిచ్చుటకు సాఫ్ట్ స్కిల్స్ , వృత్తి నైపుణ్య కోర్స్ లలో డి.ఆర్.డి.ఏ, మెప్మ ద్వారా శిక్షణలను అందించాలన్నారు. మొబైల్ ఫోన్ , సోషల్ మీడియా అనవసర వినియోగం, దీనివలన కలిగే దుష్పరిణామాల పై అవగాహన కలిగించాలని , గ్రామాల్లో సామజిక మార్పును తెచ్చే సైనికుల్లా (అంబాసిడర్) కిషోర బాలికలను తయారు చేయడంలో అధికారులు ముఖ్య భూమిక వహించాలని పేర్కొన్నారు . బాల్య వివాహాలను, టీనేజ్ ప్రెగ్నెన్సీ లను నిరోధించడానికి జిల్లా స్థాయి కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించాలని, లైన్ డిపార్ట్మెంట్స్ తో సఖి గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇవ్వాలని శిక్షణకు అవసరమగు మాడ్యుల్స్ ను డి.ఎం.హెచ్.ఓ, ఐ.సి.డి.ఎస్., పోలీస్, మెప్మ, డి.ఆర్.డి.ఏ శాఖలు తయారు చేయాలని తెలిపారు. సఖి గ్రూప్ ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని టీనేజ్ బాల బాలికల భవిష్యతు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం లో ప్రతి ఒక్కరు సామజిక బాధ్యతగా భావించి పని చేయాలన్నారు.
నాడు-నేడు వేగవంతం కావాలి: కలెక్టర్
వచ్చే వారం లోగా ప్రతి సచివాలయ పరిధి లో నాడు నేడు క్రింద కనీసం ఒక పాఠశాల పని ప్రారంభం కావాలని అదేసించారు. జిల్లాలో 454 పాఠశాల లను 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయుటకు నిర్ణయించడం జరిగిందని, ఇప్పటికే 72 పాఠశాలలకు రివాల్వింగ్ ఫండ్ 15 శాతం విడుదల అయ్యిందని తెలిపారు. నిధులు వచ్చిన పాఠశాలలన్ని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. మండల ఇంజనీర్ సిమెంట్ కు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇసుకకు ఇండెంట్ పెట్టలనని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను ఒక కిలోమీటర్ దూరం లోపల ఉన్న అంగన్వాడి కేంద్రలన్నిటిని ప్రైమరీ స్కూల్స్ లో విలీనం చేయాలనీ ఆదేశించారు. ఈ ప్రక్రియ వెంటనే జరగలని సూచించారు. ఈ సందర్భంగా మండల వారీగా కిలోమీటర్ లోపల ఉన్న అంగన్వాడి కేంద్రాలు, స్కూల్స్ జాబితాలను వెంటనే అందించేలా మండల బృందాలతో కలెక్టర్ వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా విద్యా శాఖాధికారి ఎం. జయశ్రీ, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంత కుమారి, సమగ్ర శిక్షా పి.డి. వి. స్వామి నాయుడు, విద్యా శాఖ ఏ.డి లు తదితరాలు పాల్గొన్నారు.
