*Under the PM Cares scheme for 8 children * * Health cards and pass books will be handed over by the Collector.
Publish Date : 31/05/2022
*పీఎం కేర్స్ పథకం కింద 8 మంది చిన్నారులకు చేయూత*
*కలెక్టర్ చేతుల మీదుగా హెల్త్ కార్డులు, పాస్ పుస్తకాలు అందజేత
విజయనగరం, మే 30 ః కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన ఎనిమిది మంది అనాథ పిల్లలకు పీఎం కేర్స్ పథకం కింద ఆర్థిక చేయూత అందింది. పీఎం కేర్ ఫర్ చిల్ట్రన్ పథకంలో భాగంగా పోస్టల్ పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత చిన్నారులకు సోమవారం అందజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ జిల్లాల కలెక్టర్లు, చిన్నారులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్లో ధైర్యం నింపారు. ఈ పథకం వారికి భవిష్యత్తులో ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి ఐసీడీఎస్ పీడీ శాంత కుమారితో పాటు కలెక్టర్ సూర్యకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
